07-10-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్కు వినతి
నల్గొండ రూరల్, అక్టోబర్ 6: సాంఘిక సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల 6 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 14 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు ఉన్నాయని వాటిలో వాచ్మెన్,అటెండర్, ఎలక్ట్రిషన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐసిటి కేటగిరీలలోఒక్క స్కూలు కు 5 మంది చొప్పున 70 మంది విధులు నిర్వహిస్తున్నారని వీరికి గత 6 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వీటిని వెంటనే చేయాలని కోరారు.
ఇచ్చేదే కొద్దిపాటి వేతనం అది కూడా 6 నెలలుగా రాకపోవడంతో అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి వచ్చిందని పండుగ కూడా మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ సత్యనారాయణ, సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులు పాల్గొన్నారు.