calender_icon.png 30 October, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

29-10-2025 07:12:42 PM

కోదాడ టౌన్ సిఐ కె.శివ శంకర్..

కోదాడ: మొంథా తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోదాడ పరిధిలోని అధికారులు, అన్ని శాఖల అధికారులు గ్రామాలలో పట్టణాలలో ప్రజలు అందుబాటులో ఉండాలని కోదాడ టౌన్ సిఐ కె.శివ శంకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణనష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న వాగులు వంకలు, కాలువలు, చెరువులు కుంటలు వద్దకు ఎవరూ కూడా వెళ్లవద్దన్నారు. శిధిలమైన భవనాలలో ఉండవద్దన్నారు. విద్యుత్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లు మోటర్లు స్తంభాలను తాకవద్దని ప్రజలకు రైతులకు సూచించారు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటికి రావాలని కోదాడ టౌన్ సిఐ కె శివ శంకర్ ప్రజలను కోరారు.