15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మొంథా తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

29-10-2025 07:10 PM

నేలకొరిగిన పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు..

గరిడేపల్లి (విజయక్రాంతి): మొంథా తుఫాన్ తాకిడికి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని అబ్బి రెడ్డిగూడెం గ్రామంలో వర్షాలకు నేలవాలిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయానికి మొంథా తుఫాన్ రావడంతో పండిన వరి పంట పూర్తిగా నేల పాలైందన్నారు.

వెంటనే ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ 50.000 నష్ట పరిహారం చెల్లించాలని ఆయన కోరారు. వరి పంటకు పెట్టుబడి మొత్తం పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ వల్ల రైతులు తీవ్రగా నష్టపోయారని వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన, మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వీరస్వామి,వెంకట్ రెడ్డి, వెంకన్న,సోమయ్య,శ్రీనివాస్ రెడ్డి,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.