13-06-2025 12:30:15 AM
జిల్లాలో ముగిసిన బదిలీల ప్రక్రియ: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,
కామారెడ్డి, జూన్ 12 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లాలో పోలీసుల బదిలీల ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న సివిల్ హెడ్ కానిస్టేబుల్స్ , అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ఏఎస్త్స్రలు) బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, గురువారం నిర్వహించారు. ఈ బదిలీలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ పై, పూర్తిగా పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో చేపట్టారు.
నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుల్స్, మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏఎస్త్స్రల బదిలీల్లో వారి విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు (స్పౌస్), ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ హెడ్ కానిస్టేబుల్స్ మరియు ఏఎస్త్స్రలు తమ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలి.
ప్రజలకు విశ్వాసాన్ని కలిగించేలా, నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి. ఇటువంటి సమగ్రమైన పని తీరుతోనే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.