17 April, 2026 | 5:57 AM

అర్జీలు వెంటనే పరిష్కరించాలి

11-06-2025 12:00 AM

ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, జూన్ 9 (విజయక్రాంతి):ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీ నివాస రెడ్డి తో కలిసి అర్జీలను స్వీకరించారు.

ఖమ్మం కాల్వ ఒడ్డులోని హిందూ స్మశాన వాటిక నిర్వహణ కమిటీ ఖమ్మం మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో తమకు చెందిన 14 షాపులను తొలగించారని, వీటి ద్వారా వచ్చే ఆదాయంతో మధ్యాహ్న భోజనం, ఐ బ్యాంక్ వంటి అ నేక కార్యక్రమాలు నిర్వహిస్తామని,  దయచేసి ఇట్టి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఖమ్మం ఆర్డీవో కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్ట ర్ ఆదేశించారు. ఈ ప్రజావాణిలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.