11-06-2025 12:00:00 AM
‘ఆపరేషన్ సిందూర్’పై వివిధ దేశాల్లో ప్రతినిధుల పర్యటన
న్యూఢిల్లీ, జూన్ 10: ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని వివిధ దేశాలకు వివరించిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధు లు తమ పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం వైఖరిని తెలియజేయడంలో వారి ప్రయత్నాలను ప్రధాని ప్రశం సించారు.
బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసా ద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే, జేడీ (యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపీ ఎంపీ సుప్రి యా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆయా దేశాల్లో పర్యటిం చి పాకిస్థాన్ తీరును ఎండగట్టారు.