16 April, 2026 | 9:21 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అఖిలపక్ష బృందాలతో ప్రధాని మోదీ భేటీ

11-06-2025 12:00 AM

‘ఆపరేషన్ సిందూర్’పై వివిధ దేశాల్లో ప్రతినిధుల పర్యటన

న్యూఢిల్లీ, జూన్ 10: ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు ఉగ్రవాద నిర్మూలనపై భారత వైఖరిని వివిధ దేశాలకు వివరించిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధు లు తమ పర్యటన వివరాలను ప్రధానికి వివరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం వైఖరిని తెలియజేయడంలో వారి ప్రయత్నాలను ప్రధాని ప్రశం సించారు.

బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసా ద్, బైజయంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే, జేడీ (యూ) ఎంపీ సంజయ్ కుమార్ ఝా, ఎన్సీపీ ఎంపీ సుప్రి యా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆయా దేశాల్లో పర్యటిం చి పాకిస్థాన్ తీరును ఎండగట్టారు.