04-02-2026 09:04:00 PM
పెంచికల్పేట,(విజయక్రాంతి): మండలముల కేంద్రములోని పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పెంచికల్పేట్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞాన యాత్రలో భాగంగా కరీంనగర్లోని కరీంనగర్ డైరీ పాల కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇందులో పాలన ఏ విధంగా ప్యూరిఫికేషన్ చేయడం జరుగుతుంది. పాల నుండి ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేయడము ఆ మిషన్ నీ పని చేసే విధానాన్ని గురించి విద్యార్థులకు ఆ సిబ్బంది వివరించడం జరిగింది.
కరీంనగర్లోని జింకల పార్క్ ను విద్యార్థులు సందర్శించి వివిధ రకాల జంతువులను వీక్షించి ఆ పార్కులో పరిసరాల పర్యావరణాన్ని, జంతు పరిరక్షణ ఏ విధంగా చేయాలి అని నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పెంచికల్పేట ప్రధానోపాధ్యాయురాలు విజయనిర్మల, ఉపాధ్యాయులు అందరూ విద్యార్థులతో పాల్గొనడం జరిగింది.