25-06-2025 07:59:29 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామంలో గుడుంబా అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. సోమవారం రాత్రి ఎస్సై వెంకటేష్(SI Venkatesh) పక్క సమాచారంతో గుడుంబా సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ఏటూరు గ్రామంలో నైట్ పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో బుట్టాయిగూడెం గ్రామానికి సంబంధించిన దుర్గం గిరిబాబు అనే వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుడుంబాను అక్రమంగా సరఫరా చేస్తున్న క్రమంలో 6000 రూపాయల విలువ గల గుడుంబా పట్టుకోని కేసు నమోదు చేయడం జరిగింది.
బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయని, ఎవరు కూడా గుడుంబాను సరఫరా చేయడం గాని అమ్మడం గాని చేయరాదు. గుడుంబా వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. కుటుంబాలు వీధిన పడుతున్న సందర్బంలో ఎవరైనా అక్రమంగా గుడుంబా సరఫరా చేస్తే... వారు మీకు కనిపిస్తే 8712670139 గాని 8712670089 నంబర్ కి కాల్ చేయాలని మీ వివరాలు గోప్యంగా ఉంచబడును. సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును.