31 March, 2026 | 1:35 AM

ప్రజావాణిలో 17 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

31-03-2026 12:00 AM

నిజామాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు లకు సంబందించిన  జిల్లా నలుమూలల నుండి 17 ఫిర్యాదులను స్వీకరించారు.

తమ సమస్యలపై వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేస్తూ త్వరగా సమస్య పరిష్కారానికై సిపి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్‌ల యొక్క ఎస్.ఐ సి.ఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు.  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని సి పి తెలిపారు.