calender_icon.png 28 June, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు: ఎస్పీ రాజేష్ చంద్ర

13-03-2025 08:44:34 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): 18 ఏళ్ల లోపు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు మైనర్ నడిపితే వారితోపాటు తల్లిదండ్రులు సదర్ వాహన యజమానులపై కట్ల చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, నరసన్నపల్లి చౌరస్తాల వద్ద  పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ విస్తృతంగా చేపట్టారు . పోలీసులు చేస్తున్న వానాల తనిఖీ చేస్తున్న తీరును ఆయన పరిశీలించారు. ఎస్పీ రాజీవ్ చంద్ర మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా వారి తల్లిదండ్రులు చూడాలన్నారు. తమ మైనర్ పిల్లలకు వాహనాలను ఇచ్చి తల్లిదండ్రులు ఇబ్బందులకు గురికా వద్దన్నారు. మహిళలు వాహనాలను వారిపై వారితో పాటు వారి తల్లిదండ్రులపై కేసును నమోదు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించవద్దని ఆయన సూచించారు. ఈ వాహనాల తనిఖీలు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నరసింహారెడ్డి, రామన్, చంద్రశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్ , సంతోష్ కుమార్, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.