పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ముగ్గురి అరెస్ట్, నగదు, మొబైల్ ఫోన్లు, బైకులు స్వాధీనం
కోటపల్లి (చెన్నూర్), మార్చి 23 : చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండల పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిని సోమవారం కోటపల్లి పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ శివారులో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా .. ఈ దాడిలో ఏడుగురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, వారిలో ము గ్గురిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకోగా నలుగురు పోలీసులను చూసి అక్క డి నుంచి తప్పించుకొని పారిపోయారు.
అరెస్టయిన జనగాం మల్లేష్, మనుమల్ల అనిల్, గోగు నాగరాజుల నుంచి రూ. 4,050 నగదు, నాలుగు మొబైల్స్, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. గోగు రాజేందర్, గోగు సత్తన్న, కుంతి పోషం, మనుమల్ల వినోద్ లు పరారీలు ఉన్నారు. ఈ మేరకు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ దాడిలో కోటపల్లి హెడ్ కానిస్టే బుల్ బుజ్జిబాబుతో పాటు టీజీఎస్పీ కానిస్టేబుళ్లు రాంప్రసాద్, సతీష్, సందీప్, రాజ్ కుమార్, నరేష్లు పాల్గొన్నారన్నారు.




