14-08-2025 01:21:06 AM
మేడ్చల్ అర్బన్, ఆగస్టు 13:మేడ్చల్ పో లీస్ ట్రైనింగ్ కళాశాలలో ఆగస్టు 12, 13 తేదీలలో డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను పోలీసు విధులలో వినియోగించడంపై రిఫ్రెషర్ ట్రై నింగ్ కోర్సును విజయవంతంగా నిర్వహించామని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రి న్సిపాల్ పి.మధుకర్ స్వామి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 100 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల ఆ ధ్వర్యంలో ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వా రా నేర నియంత్రణ, భద్రతా వ్యవస్థల బలోపేతం, డిజిటల్ ఫోరెన్సిక్ పద్ధతులు అలాగే ఇంటెలిజెంట్ సర్వైలెన్స్ సిస్టమ్ల వినియోగం పై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పోలీస్ సిబ్బంది సాంకేతిక నై పుణ్యాలను పెంపొందించుకొని, ప్రజా భద్రతను మరింత సమర్థవంతంగా కాపాడడా నికి ఉపయోగపడుతుందని తెలిపారు.
డ్రోన్ టెక్నాలజీ వినియోగం వల్ల ట్రాఫిక్ జామ్ లను గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులు కదలికలను గుర్తించడం, ప్రజలు ఎక్కువగా గుమి కూడిన ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాల్లో సహాయకారిగా ఉంటుందని అన్నారు.అలాగే పోలీసు వారి రోజువారి విధులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం వల్ల సైబర్ నేరాలను అరికట్టడం,
నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడం వంటి వాటిలో సహాయకారిగా ఉంటుందని అలాగే సైబర్ సెక్యూరిటీలో శిక్షణ పొందడం ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు వివిధ సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో ఎథికల్ హ్యాకింగ్ నిపుణులు కె.అఖిలేష్ రావు మరియు ఆర్టిఫిషియల్ ఇం టిలిజెన్స్ లో నిపుణులైన నిఖిల్ గుండా, పర్సనాలిటీ డెవలప్మెంట్ హ్యాండ్ రైటింగ్ నిపుణుడు మల్లికార్జున రావు, పోలీస్ ట్రైనిం గ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కెవి. విజయ్ కు మార్ డీఎస్సీ, ఇన్స్పెక్టర్లు కె.ఎస్ రవి కుమా ర్, చంద్రశేఖర్, రాంబాబు, కిరణ్ కుమార్, మంజుల మరియు కళాశాల సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.