23 July, 2026 | 12:49 AM

డి.శ్రీనివాస్ మరణం పట్ల.. రాజకీయ నేతల సంతాపం

29-06-2024 11:55 AM

హైదరాబాద్: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు సంతాపం తెలిపారు. సమైక్య రాష్ట్రంలో శ్రీనివాస్‌ కీలకపాత్ర పోషించారని, ఏళ్ల తరబడి కాంగ్రెస్‌ పార్టీకి ఆయన విశేష సేవలందించారని రేవంత్‌ రెడ్డి కొనియాడారు. మంత్రిగా, ఎంపీగా డి.శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయనకు నివాళులర్పించారు. శ్రీనివాస్ చిత్తశుద్ధితో రాజకీయాలు చేసిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు అభివర్ణించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కు ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత, 2004 నుండి 2009 వరకు ఆయన అసెంబ్లీలో ఉన్న సమయంలో ఆయన అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. అతని ఆత్మ శాంతించాలని, డీఎస్ శ్రీనివాస్ అంత్యక్రియలు రేపు ఉదయం నిజామాబాద్‌లో నిర్వహించనున్నారు. రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తుచూసుకుంటూ పార్టీలకతీతంగా రాజకీయ నేతలు మాజీ మంత్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, మంత్రి పొన్నం ప్రభాకర్, వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, మాజీ మంత్రులు ఇంద్రకిరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.