08-06-2025 12:24:40 AM
గ్రామీణ, పట్టణాల్లోనూ సమానంగా తగ్గిన పేదరికం
న్యూఢిల్లీ, జూన్ 7: పేదరిక ని ర్మూలనలో భారత్ చారిత్రాత్మక వి జయాన్ని సాధించింది. గత దశాబ్ద కాలంగా దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ బ్యాం కు వెల్లడించిన వివరాల ప్రకారం 2 011 సంవత్సరంలో భారత్లో పేదరికం రేటు 27.1 శాతంగా ఉండ గా.. 2022 నాటికి 5.3 శాతాని కి పడిపోవడం విశేషం.
ఈ గణాంకాలు దేశ ఆర్థిక ప్రగతికి, ప్రభుత్వ పథకాల ఫలవంతమైన అమలుకు అద్దం పడుతున్నాయి. సంఖ్యాపరం గా 2011 344.47 మిలియ న్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలో జీవించగా.. 2022 నాటికి ఈ సంఖ్య 75.24 మిలియన్లకు తగ్గింది.
11 ఏళ్ల వ్యవధిలో దాదాపు 26 కోట్లకు పైగా మంది ప్రజలు అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ తగ్గుదల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమానంగా కనిపించిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. 2021 ధరల ప్రకారం రోజుకు మూడు డాలర్ల అంతర్జాతీయ పేదరిక రేఖ ప్రామాణికంగా దీనిని రూపొందించారు.