ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
* వసంతరావు జాదవ్.. ఏపీవో జనరల్..
ఉట్నూర్,(విజయక్రాంతి): సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో జనరల్ వసంతరావు అన్నారు. సోమవారం కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన సెమేష్ తనకి బోర్ వెల్ మంజూరు కల్పించామని దరఖాస్తు చేశారు. ఇచ్చోడా మండలం దేవుల నాయక్ తండా గ్రామానికి చెందిన విశాల్ తనకి ల్యాప్ టాప్ మంజూరు కొరకు అర్జీ కోరారు.
ఇంద్రవెల్లి మండలం దొడందా గ్రామానికి చెందిన లక్ష్మి తనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కల్పించామని అర్జీ కోరారు,కడెం మండలం ఇష్టంపూర్ గ్రామానికి చెందిన వెంకటి తనకి త్రీ ఫేస్ కరెంటు ఇప్పించమని అర్జీ .నార్నూర్ మండలం చిత్తగూడ గ్రామానికి చెందిన శ్రీలత తనకి ఏదైనా ఉపాధి కల్పించమని కొరకు అర్జీ కల్పించామని దరఖాస్తు పెట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






