calender_icon.png 30 December, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి

30-12-2025 12:00:00 AM

ములుగు,డిసెంబర్29(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలె క్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు రెవె న్యూ సి హెచ్ మహేందర్ జి, స్థానిక సంస్థ లు సంపత్ రావు, ఆర్డీవో వెంకటేష్ లతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 59 దరఖాస్తులు వచ్చాయి.భూ స మస్యలు 12, గృహ నిర్మాణ శాఖకు 08, పెన్షన్ 09, ఉపాధి కల్పనకు 05ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 25 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.