26 April, 2026 | 7:54 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కారించాలి

09-12-2024 06:51 PM

అదనపు కలెక్టర్ డి.వేణు...

పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులకు తెలిపారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన బొంత పూజిత సింగరేణి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ క్రింద తమ గ్రామాన్ని తీసుకుందని, తాను తమ అమ్మమ్మ గారి ఊరు తుర్కల మద్దికుంటకు వచ్చి గత ఆరు సంవత్సరాలు గడిపామని, తనపై చదువుల కోసం తనకు ఆదాయ కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని, సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు గ్రామానికి చెందిన బి.సతీష్ ఎంపీడీవో కార్యాలయం నందు గల దుకాణ సముదాయం నందు 1 రూమ్ జీవనోపాధి కోసం కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సుల్తానాబాద్ ఎంపిడిఓ కు రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని, అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పి. రాజేశం తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి రాస్తూ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, కలెక్టరేట్ హెచ్ విభాగం సూపరింటెండెంట్ జగదీశ్వర్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.