సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల భద్రత కల్పించాలి
09-12-2024 06:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యాశాఖలో సర్వ శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలని ఎస్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమున యాదవ్ జి.లక్ష్మణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సోమవారం మద్దతు పలికి రిలే దీక్షలు చేశారు. సంవత్సరాల తరబడి ఉద్యోగాలు చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టి నాయకులు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు.






