05-10-2025 01:01:44 PM
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమం నిలిపివేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం మళ్లీ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎన్నికల నియమావళి అమలు విషయంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.