05-09-2025 10:28:12 AM
హైదరాబాద్: జవహర్ నగర్(Jawaharnagar) లోని కాప్రా వద్ద శుక్రవారం ఒక గర్భిణీ స్త్రీ హత్యకు(Pregnant woman) గురైంది. దుండగులు ఆమెపై లైంగిక దాడి చేసి హత్య చేశారా లేదా అనేది ఇంకా నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని ఇంకా గుర్తించలేదు. ఆమె వయస్సు ముప్పై సంవత్సరాలు ఉంటుందని అనుమానిస్తున్నారు. సాకేత్ టవర్స్ సమీపంలోని పొదల మధ్య తలకు గాయాలతో ఆమె మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. జవహర్నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ బృందం, డాగ్ స్క్వాడ్ కూడా పరిశీలించారు.
"ఆమె తలపై బండరాయితో దాడి చేయడంతో ఆమె మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. హత్యకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందా లేదా అనే దానితో సహా అన్ని కోణాల నుండి మేము దర్యాప్తు చేస్తున్నాము" అని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. అనుమానితుల ఆధారాలను పొందడానికి సంఘటనా స్థలానికి వెళ్లే రోడ్లు, పరిసరాలలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆమెను అక్కడికక్కడే హత్య చేశారా లేదా వేరే చోట చంపి మృతదేహాన్ని అక్కడే పడేశారా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.