05-09-2025 11:49:59 AM
హైదరాబాద్: జోగుళాంబ గద్వాల్ జిల్లాలో(Jogulamba Gadwal District) గణేష్ విగ్రహ నిమజ్జనం తర్వాత తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ను డీసీఎం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇటిక్యాల మండలం బిచ్చుపల్లి సమీపంలోని కృష్ణా నదిలో విగ్రహాన్ని నిమజ్జనం(Ganesh immersion) చేయడానికి 11 మంది వ్యక్తులు వెళ్లారని స్థానికులు తెలిపారు. గ్రామానికి తిరిగి వస్తుండగా డీసీఎం ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మండల శంకర్ (21), గుప్తా సాయి తేజ (23) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, విష్ణు, అబ్దుల్లా అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎం అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంకు చెందినవాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతంరం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.