16 April, 2026 | 11:58 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

అట్టహాసంగా బెల్లంపల్లిలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్

26-12-2025 07:47 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. శుక్రవారం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బెల్లంపల్లి ఏసీపీ   ఎ. రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు పెడమార్గం పట్టకుండా  ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎంతగానో అవసరమన్నారు. క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని సాధించి బెల్లంపల్లికి పేరు తేవాలన్నారు.

ఈ లీగ్ టోర్నమెంట్ ను మూడు విభాగాలుగా ఏబీసీ  పేరుతో విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ క్రికెటర్ ఈగ వెంకటస్వామి, అకాడమీ ఇన్చార్జ్ అల్లం వెంకటేశ్వర్లు కోచ్ జాడి శేఖర్, సీనియర్ క్రికెటర్లు బూదే సత్తి, గీస రాములు, జి శ్రీనివాస్ చారి, అల్లం గౌతం, పీ ఏ టీ  హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.