17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కలెక్టరేట్ ముట్టడని విజయవంతం చేయండి: కల్లోజు శ్రీనివాస్

26-12-2025 07:45 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27 అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా రేపు చలో కలెక్టరేట్ కు జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్  పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం జీఓ ను సవరించాలని తాము కోరుకుంటున్నామని, ఒకవేళ తాత్సారం చేస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు. కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మన యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, డెస్క్ జర్నలిస్టులు, సబ్ ఎడిటర్ లు, ఫోటో గ్రాఫర్ లు పాల్గొని విజయవంతం చేయాలనీ  కోరారు.