calender_icon.png 30 June, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబు నటుడు కాదు ఒక హీరో

29-06-2025 08:02:20 PM

హీరోకు ఆస్కార్ అవార్డు ఇవ్వడం సభబే..

శ్రీధర్ బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరిన పుట్ట మధుకు కృతజ్ఞతలు..

మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్..

రామగిరి: మంథని నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రజల కోసం ఒక హీరో లాగా సేవ చేస్తున్న నాయకుడైన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) నటుడు కాదని ఆయన ఒక హీరో అని హీరో శ్రీధర్ బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరిన పుట్ట మధుకు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి(Manthani Block Congress President Thotla Tirupati) యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం రామగిరి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తు ఉంటే, నాకు నా రాజకీయ జీవితం ప్రశ్నార్తకంగా మారే విధంగా ఉందని మాజీ నాయకుడు పుట్ట అక్కసు వెళ్ళబోతున్నాడని విమర్శించారు.

మా మంత్రి వందల కోట్ల రూపాయల్లో అభివృద్ధి పనులు తీసుకోవచ్చి శంకుస్థాపనలు చేస్తుంటే పుట్ట మధు మతిభ్రమించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నాడని అన్నారు. మంథని నియోజకవర్గంలో ఒక ఐటీ కంపెనీ పెట్టలేదని మాట్లాడుతున్న మదు కళ్ళు కనిపిస్తలేవా? మంథని, గోదావరి ఖని రోడ్లలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి ఆరు నెలలు గడుస్తా ఉందని, స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సెంటెరీ కాలినీలో ఇండస్ట్రియల్ కి సంబంధించి మంత్రి ప్రయత్నం చేస్తున్నాడని, మంథనిలో రోడ్లకు సంబంధించింది నిన్నటికి నిన్నా వందల కోట్ల రూపాయల నిధిని వేచించి మంథని రింగ్ రోడ్ కు గోదావరి పైన బ్రిడ్జితో పాటు ఇండస్ట్రియల్ కారిడర్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నాడని, అందులో భాగంగా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో మరికొంత ప్రైవేట్ భూమి ఇద్దామనుకున్న మీరు కొంత మంది చిల్లరరమల్లరా కార్యకర్తలతో మీ బీఆర్ఎస్ పార్టికి సమ్మందించిన వారితో ఇండస్ట్రియల్ పార్కు రాకుండా ధర్నా చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. 

ఒకవేలా నువ్వు కాదంటే కాదా మేము దానిని నిరూపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, కాబోయే రోజుల్లో కూడా ఆరోసారి ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును గెలుస్తారని, మీరే చెప్పుతుండడం చాలా సంతోషం అన్నారు. మంథని నియోజకవర్గంలోని ఓటర్లకు బువ్వ పెట్టనోడు, నీళ్లు పోయినోడు ఆరు సార్లు  శాసన సభ్యునిగా గెలవడం జరిగుతుందని అనుకున్నావు కాదా.... నిజంగా దేవుడా ఆపని చేస్తాడన్నారు. 

శ్రీధర్ బాబు నిజంగా ప్రజలకు దేవుడే

మంథని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు ఒక దేవుడి లెక్క కొలుస్తున్నారని పుట్ట మధు ఆరోపించడం నిజంగా నిజమేనని తిరుపతి యాదవ్ అన్నారు. మంథని నియోజకవర్గంలో గత 40 ఏండ్లుగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు, మంత్రి శ్రీధర్ బాబు కుటుంబాన్ని మంథని ప్రజలు ఆరాధించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేసి గెలిపించకున్నారని, అందుకే శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గ ప్రజలకు ఒక దేవుడిలా రాత్రి పగలు పనిచేస్తున్నాడని కొనియాడారు.

నీకు ఒక్కసారి మంథని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే, రౌడీయిజం, గూండాయిజం చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశావని, అందుకే ప్రజలు నీకు రెండోసారి కూడా గుణపాఠం చెప్పారని, ఇక నీ రాజకీయ జీవితం ముగిసినట్టేనని తిరుపతి యాదవ్ అన్నారు. ఆయన వెంట నాయకులు ఎల్లే రామ్మూర్తి, ఎస్ ఎస్ అన్వర్, తీగల సమ్మయ్య, ఎరుకల బాబురావు, గొర్రె నరేష్ యాదవ్, అంబీరు శ్రీనివాస్ పటెల్, ఇనగంటి చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.