24-05-2025 05:48:12 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణాకు రెవెన్యూ అధికారులు చెక్ పెట్టారు. బూర్గంపాడు మండలంలోని సారపాక బ్రిడ్జి, గొమ్మూరు ర్యాంపు ప్రాంతంలో గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుపుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు శనివారం జేసీబీతో కందకాలు తవ్వించారు. కందకాలు పూడ్చి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.