24-05-2025 05:50:32 PM
మునిపల్లి: మండలంలోని ప్రైమరీ స్కూల్స్ ఉపాధ్యాయులకు సంబంధించి ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించిన శిక్షణ శిబిరం శనివారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంలో ఎంఈఓ భీమ్ సింగ్(MEO Bhim Singh) పాల్గొని ఉపాధ్యాయులకు పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ.. గతంలో మాదిరి కాకుండా తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం తదితర వాటిపై ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు పరిసరాల విజ్ఞానం పుస్తక రచయిత బాలాజీ, జిల్లా రిసోర్స్ పర్సన్స్ చంద్రమౌళి, జ్యోతి, సంతోషమ్మ, మండల రిసోలన్ పర్సన్స్ గోపాల్, కిష్టయ్య, సిద్దేశ్వర, ఉమారాణి, అనురాధ, సాయిలు, మండల వనరుల కేంద్రం సిబ్బంది నరేష్, విట్టల్, మానయ తదితరులు పాల్గొన్నారు.