పారిశుధ్యం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): మున్సిపాలిటీల్లో పారిశుధ్యం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, పారిశుధ్య నిర్వహణపై నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. గురువారం డోర్నకల్ మునిసిపాలిటీలో చైర్ పర్సన్ కొండేటి రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.
బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలని, నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని సూచించారు.వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించి, అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో డోర్నకల్ మునిసిపల్ కమిషనర్ నిరంజన్, వైస్ చైర్ పర్సన్ మాదా లావణ్య, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.




