జీహెచ్ఎంసీ ఉద్యోగులను వేధిస్తే సహించం
27-03-2026 02:29 AM
మలక్పేట్, మార్చి 26 (విజయక్రాంతి): కార్మికులు, ఉద్యోగులను అకారణంగా వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని జిహెచ్ ఎంసి మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్(ఐఎన్టియుసి) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ అన్నారు. గురువారం మలక్పేటలోని జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం లో వివిధ యూనియన్లకు చెందిన ఉద్యోగులు ఆదిల్ షరీఫ్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూ సీల చేరారు.
ఈ సందర్భంగా ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి విభజన, అదనపు సర్కిల్లా ఏర్పాటుతో ఉన్న ఉద్యోగుల పై పని భారం తీవ్రతరమైందని ఆయన అ న్నారు. అధికారులు కావాలని తమ కార్మికు లు, ఉద్యోగులను పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ సెక్రటరీ, మహి ళా విభాగ అధ్యక్షురాలు పల్లవి పాల్గొన్నారు.




