14 June, 2026 | 4:15 PM

Breaking News

ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •   రక్తదానం చేసిన సాయి కిషోర్ గౌడ్   •  

పేద విద్యార్థులకు బహుమతులు అందజేత

25-01-2026 02:01 PM

కేసముద్రం,(విజయక్రాంతి): రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని అమీనాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు గ్రామానికి చెందిన మేకల అశోక్ కుమార్ 2000 రూపాయల విలువైన బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఈ సందర్భంగా అశోక్ కుమార్ విద్యార్థులకు ఉద్బోధించారు. పేద విద్యార్థులకు అశోక్ చేయూత అందించడం పట్ల పాఠశాల హెడ్మాస్టర్ పత్తి వీరస్వామి కృతజ్ఞతలు తెలిపారు.