15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కురవి వీరభద్రుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు

25-01-2026 01:44 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు రధ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాలను భక్తుల జయ జయ ద్వానాల మధ్య మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని వీరభద్ర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఈవో శ్రావణపు సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.