22 April, 2026 | 2:10 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

05-04-2025 12:00 AM

హనుమకొండ, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండలో రైతు సత్యాగ్రహ దీక్ష ఘనంగా నిర్వహించబడింది. హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు  కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి  గోలి మధుసూదన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీర్ సీతారాం నాయక్ , మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, హనుమకొండ మాజీ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డా. కాళీ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేవైఎం నాయకులు ,జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కిసాన్ మోర్చా నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.