10-12-2025 11:29:58 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మందమర్రి ఏరియాలోని శాంతిఖని గనిలో పలువురు కార్మికులకు బుధవారం ప్రమోషన్ పత్రాలను అందజేశారు. టైమ్ రేటెడ్ ప్రమోషన్ 2025 సంవత్సరానికి గాను నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన ఉద్యోగులకు గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా ప్రమోషన్ ఆర్డర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలోగని సంక్షేమ అధికారి రిబికుమార్, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి తిరుపతి, ఇతర అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.