calender_icon.png 25 June, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బడుల్లో భోజనం వసతుల్లో నాణ్యత కరువు..

25-06-2025 05:35:25 PM

బీఆర్ఎస్వీ బడిబాటలో వెలుగు చూసిన సమస్యలు..

వెంటనే అధికారులు స్పందించాలి..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బడిబాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ హై స్కూల్, ప్రైవేటు యువ సంఘటన హైస్కూల్ ను ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు బడికిల శ్రావణ్(District President Badikila Shravan) సందర్శించారు. మధ్యాహ్న భోజనం, ఇతర వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం మంచిగాలేదన్నారు. నాసిరకం కూరగాయలు నీళ్ల చారుతో అన్నం పెడుతున్నారనీ ఆరోపించారు. ఈ విషయాన్ని విజిట్ సందర్భంగా విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి అందే సరుకులు సమయానికి రావడం లేదనీ నిర్వాహకులు తెలిపారని చెప్పారు.

ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థుల కోసం ఆలోచించి సరైన సమయానికి నాణ్యమైన సరుకులు ఇవ్వాలని కోరారు. అలాగే విద్యార్థులకు అందించే కాస్మొటిక్స్ అందించాలన్నారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మధ్యాహ్నం భోజన నిర్వహుకులను ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి మాజీ నియోజకవర్గ అధ్యక్షులు మురుకురి శ్రావణ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు అడెపు అరుణ్, కార్యదర్శి వడ్డేపల్లి నితీష్, నాయకులు చాణక్య, రోషన్, సాయి కిరణ్, నవీన్ కార్యకర్తలు పాల్గొన్నారు.