02-06-2025 02:06:54 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, జూన్ 1 (విజయ క్రాంతి): విద్యార్థులు లక్ష్యంతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. చదువుకు పేద ధనిక బేధం లేదని, చక్కగా చదువుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం స్వచ్ఛంద సంస్థల చేయూత అవసరమని ఆయన పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్యా తండాలోఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణా శిబిర ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కేసముద్రం, ఇనుగుర్తి మండల పరిధిలో పదవ తరగతిలో ప్రతిభ చాటిన విద్యార్థులకు విజేత పురష్కార్ అవారడ్స్ అందజేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్ , డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్, డాక్టర్ జె. రాజారాం, కేసముద్రం ఎస్.ఐ. మురళీధర్ రాజ్, లీడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాసుల రవికుమార్, బ్రహ్మ సమాజ్ ప్రతినిధి మధు బిందు, కొమ్ము రాజేందర్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శాస్త్రవేత్త మోహన్, జనరల్ సెక్రటరీ జయకృష్ణ, డైరెక్టర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.