17-02-2026 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఫిబ్రవరి16: నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు గ్రామాలలో ఆదర్శవంతమైన పరిపాలన అందించాలని ఎంపీడీఓ పల్లపు ఝాన్సీ అన్నారు. సోమవారం మండలంలోని రామన్నగూడెం గ్రామ రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి,పరిపాలన అంశంలో రాజకీయాలను దూరంగా ఉంచుతూ రాబోయే 5సంవత్సరాల పాటు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ గోపి,శిక్షకులు సుధాకర్,సతీష్,సలీం,జూనియర్ అసిస్టెంట్ శిల్పిక,వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.