06-01-2026 12:00:00 AM
మరిపెడ, జనవరి 5 (విజయక్రాంతి): పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం మరిపెడ మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్న భోజనం విరామ సమయంలో మండల విద్యా వనరుల కేంద్రం పి ఆర్ టి యు ఎస్ 2026 టేబుల్ క్యాలెండర్ ను మరిపెడ మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్టియు రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు గుగులోత్ అర్జున్, సంఘ బాధ్యులు దోమల లింగన్న, రాంమోహన్, దత్తప్రసాద్, యాకయ్య, కరుణాకర్, సరోజ, వెంకన్న, నర్సిరెడ్డి,లెనిన్, వెంకన్న, విజయ్ కుమార్, వెంకటయ్య, రవి, నామ, శ్రీను, భీమా, నర్సిరెడ్డి, నివేదిత, రాజకుమారి, మురళి, విశ్వనాథం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.