16-06-2025 08:22:04 PM
అదనపు కలెక్టర్ డి.వేణు...
పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రజావాణిలో తీసుకున్న ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు(District Additional Collector D. Venu) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలు తెలుపుతూ ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన సెట్టు సురేష్ పెద్దపల్లి జిల్లా పరిధిలో ఎన్ని కబేరాలు (గేదేలు, ఆవులు, ఎద్దులు) కోయడానికి ఎన్ని షాపులకు అనుమతులు ఉన్నాయో వివరాలు తెలుపగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టరేట్ సి విభాగంకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాల్నారు.
పెద్దపల్లి మండలం పెద్ద కాల్వల గ్రామానికి చెందిన బోంగు రాజమ్మ భర్త: మల్లయ్య తనకు బోదకాలు ఉన్నందున దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ డీఆర్డిఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, సుల్తానాబాద్ మండలం తోగ్రాయి గ్రామానికి చెందిన పాలకుర్తి లక్ష్మి గ్రామ శివారు సర్వే నెంబర్ 645 లో తమ కుటుంబానికి చెందిన భూములను తనకు తన కుమారునికి తెలియకుండా రెండవ కోడలు పాలకుర్తి రజిత తన పేరు మీద పహాణీలో పట్టాదారుగా నమోదు చేస్తుందని, చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తమ భూమి తమకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ పెద్దపల్లికు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ ప్రజావాణిలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.