calender_icon.png 18 June, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటూరునాగారం నార్త్ రిజర్వ్ ఫారెస్టులో గుడిసెలు వేసిన గిరిజనులు

16-06-2025 08:42:09 PM

గుడిసెలు తొలిగించేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై కారం,కర్రలతో దాడికి దిగిన గిరిజనులు..

సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు..

పోలీసుల సహాయంతో అక్కడ నుండి ప్రాణాలతో బయటపడ్డాము..

ఏటూరునాగారం నార్త్ రేంజ్ డిప్యూటి రేంజ్ అధికారి ఎండీ అప్సర్ ఉన్నిషా..

ఏటూరునాగారం (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం నార్త్ రేంజ్ అటవీ శాఖ అధికారుల(North Range Forest Department officials)పై ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్టులో గుడిసెలు వేసిన గిరిజనులు సోమవారం దాడులకు దిగారు. గత సంవత్సర కాలంగా ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం నార్త్ రేంజ్ అటవీ శాఖ పరిధిలోని రొయ్యూర్ బీట్, రోయ్యూర్ సెక్షన్ లోని రిజర్వ్ ఫారెస్ట్ లోని అటవీ ప్రాంతంలో కొంత మంది గిరిజనులు అక్రమంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే ఇటీవల పలుమార్లు అక్రమంగా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేసి గుడిసెలను తొలగించినా తిరిగి గుడిసెలు నిర్మిస్తూ అక్కడే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే అక్రమంగా అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి గుడిసెలను తోలగించే ప్రయత్నంలో సోమవారం ఉదయం అటవీ శాఖ అధికారులపై గుడిసెలు వేసిన గిరిజనులు తిరగబడగా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే గుడిసెలు వేసిన గిరిజనులు అటవీ శాఖ అదికారులపై కారం పోడి చల్లుతూ కర్రలతో దాడులకు దిగారు. ప్రాణ భయంతో అటవీ శాఖ అధికారులు పరుగులు తీయగా,ఇదే క్రమంలో గుడిసెలు కూల్చి వేయడానికి వచ్చిన జేసీబీ వాహనంపై దాడి చేయగా అద్దాలు పగిలిపోయాయి.

డ్రైవర్ పై కత్తితో దాడి చేయగా డ్రైవర్ కు గాయం అయినట్లు, సమాచారం పరిస్థితి విషమించడంతో వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం పోలిస్లు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణను అదుపులోకి తీసుకోచ్చారు. అయితే జరిగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు స్థానిక పోలిసు స్టేషన్ లో పిర్యాదు చేసినట్టు సమాచారం. అలాగే అటవీ శాఖ పరిధిలో అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్ గుడిసెలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు.

జరిగిన ఘటనపై వివరణ ఇచ్చిన నార్త్ రేంజ్ డిప్యూటీ రేంజ్ అధికారి ఏండీ అప్సర్ ఉన్నిసా...

అక్రమంగా అటవీ ప్రాంతంలో గుడిసెలు వేసిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి గుడిసెలు తొలగించే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలోనే గుడిసెలు వేసిన గిరిజనులు మాపై కర్రలు, కారం పోడితో దాడికి దిగారు. పరిస్థితి చేయి దాటి పోయింది. జేసీబీ డ్రైవర్ అల్లం రమేష్ కు గాయాలు అయ్యాయి. పోలిసుల సాయంతో అక్కడి నుండి ప్రాణాలతో బయట పడ్డాం.