calender_icon.png 6 June, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజా పాలన

03-06-2025 12:00:00 AM

  1. నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
  2. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
  3. జిల్లా కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నూతనం గా ఏర్పడ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన లో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతుందని నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామ ని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పునరుద్ఘాటించారు.

జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వే డుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, జాతీయ జెండా ఆవిష్కరిం చిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 18 నెలల్లో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

దీనిలో భాగంగా దేశంలోనే కా కుండా ప్రపంచంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్ 2047 లక్ష్యంతో ముందు కు సాగుతున్నట్లు తెలిపారు. దీనిలో భాగం గా పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్ప టికే పేద ప్రజలకు మేలు చేసే పథకాలైన ఇం దిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి లాంటివి అమలు చేసినట్లు తెలిపారు.

సరైన లబ్ధిదారులను గుర్తించి అర్హత గల వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో జిల్లాలో ఒక కోటి మంది మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినట్టు తెలిపారు. 73 వేల కుటుంబాలకు 500 రూపాయలకు వంట గ్యాస్ అందిస్తున్నట్లు వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును 72,000 కుటుంబాలకు అందజేసినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా జిల్లాలో మొద టి విడత 1,669 ఇండ్లు మంజూరు కాగా, రెండో విడతలో 4,410 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు.

మహిళా సంఘాల బలోపే తానికి ఇప్పటికే 150 బస్సులు వారికి కొనుగోలు చేసి అందించగా వారికి 600 బస్సు లు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడు మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ఏర్పడి చేసినట్టు తెలిపారు. రుణ విముక్తి కింద 51 వేల రైతులకు రుణ విమోచన చేసినట్లు తెలిపారు. ఎప్పటినుండో ఎస్సీ వర్గీకరణ కోసం ఆ వర్గం వారు చేస్తున్న డిమాండ్ ను తీర్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు.

కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ఎన్నికల్లో చెప్పిన హామీ మేరకు మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో భర్తీ చేయగా, జిల్లాలో 12 జాబు మేళాలు నిర్వహించి 112 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

విద్యావ్యవస్థలు సమూల మార్పులు తీసుకువచ్చామని దీనిలో భాగం గా జిల్లాలో 284 పోస్టులు భర్తీ చేశామని, రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఎకానమీ రాష్ట్రం గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ వేదిక పై ఆవిష్కరించడంలో విజయం సాధించామని, దీనికి నిదర్శనమే వివిధ రకాల ప్రపం చ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి భూ సమస్యలతో బాధపడుతున్న రైతులకు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని, క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి రైతుల నుండి మద్దతు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వా త కొత్త కుటుంబాలకు ఒక రేషన్ కార్డు కూ డా ఇవ్వలేదని తాము నూతన రేషన్ కార్డు లు ఇస్తూ చరిత్ర తిరగ రాస్తున్నామన్నారు.

14 నుండి 18 సంవత్సరాల కౌమార దశ బాలికలకు రక్తహీనత నివారణ కోసం చిక్కిలను అందజేయడానికి నిర్ణయం తీసుకోగా ఆసిఫాబాద్ ను ఆస్పరేషన్ జిల్లాగా ఎన్నుకున్నట్లు వివరించారు. అధికారుల సమన్వ యంతో జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నప్పటికీ గడిచిన 18 నెలల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ప్ర యత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడిజిల్లా ఎమ్మెల్సీ దండే విటల్, రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్ సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఏ ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అలరించిన నృత్యాలు

ఆవిర్భావ వేడుకలు సందర్భంగా జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలకు చెందిన శానివి, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యం తో పాటు, కెరమెరి మండలం హట్టి విద్యార్థులు చేసిన గోండు నృత్యం అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి బృందం సభ్యులు పాటలతో అలరించారు.

నాణ్యమైన విత్తనాలు అందజేత

జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మొదటి విడతలో 1203 మంది రైతులకు 1203 ఎకరాల్లో విత్తనాలు అందజేయడానికి నిర్ణయించగా 10 మంది రైతులకు మండలి డిప్యూటీ చైర్మన్ అందజేశారు.