13-09-2025 09:38:14 PM
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. శనివారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గ్రామాలకు జెపిఓ లను ప్రభుత్వం నియమించిందని వారితో సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సాదా బైనమా దరఖాస్తు చేస్తున్నవారు పారాన్ని డౌన్లోడ్ చేసి పరిశీలించి పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దిలీప్ కుమార్, రెవెన్యూ డిటి శ్రావణి, సీనియర్ అసిస్టెంట్ నవనీత్ పాల్గొన్నారు.