23-12-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి.
ములుగు డిసెంబర్22(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబం ధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసు కోవాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హె చ్. మహేందర్ జి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలె క్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో 35 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 08, గృహ నిర్మాణ శాఖకు 04, పెన్షన్ 06, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 17 దరఖాస్తులు స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.