calender_icon.png 18 June, 2025 | 12:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలి

09-08-2024 12:05:00 AM

సీపీఎం నాయకుల డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): నగరంలో ట్రాఫిక్ సమ స్యలను అధిగమించడానికి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నగరంలో జనాభాకు అనుగుణంగా సిటీ బస్సులను పెంచాలని సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం బస్‌భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మహాలక్ష్మి పథకం ప్రారంభించడం శుభపరిణామమే కానీ, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని అన్నారు. ఈ సందర్భంగా నగరవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన మెమోరాండంను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు అందజేశా రు.  ధర్నాలో డీజీ నరసింహారావు, ఎం శ్రీనివాస్, శ్రీనివాసరావు, మహేందర్, దశరథ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.