21-08-2025 12:46:13 AM
మంథలో విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యులు శశిభూషణ్ కాచే
మంథని ఆగస్టు 20(విజయ క్రాంతి) టి ఆర్ఎస్ ప్రభుత్వంలో వామన్ రావు దంపతుల హత్య కేసులో త్వరలో జరగనున్న సి బిఐ విచారణలో హంతకుడిగా మారనున్న పుట్ట మధు కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ఆ తర్వాత లేదని టిపిసిసి ఎన్నికల కమీటి స భ్యులు శశి భూషణ్ కాచే అన్నారు.
బుధవారం మంథని లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామన్ రావుల దంపతుల ను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసి తప్పించుకున్న మా జీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే పుట్ట మధు పై ఎ న్నో ఆరోపణలు వచ్చాయని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వామన్ రావు హత్య కేసులో నుంచి తప్పించుకున్నాడని,
తన కొడుకు కూడలను పుట్ట మధు అతని భార్య అండదండలతోటే హత్య చేశారని వాహనరావు తండ్రి తండ్రి సుప్రీంకోర్టులో వేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ వి చారణలో త్వరలోనే దోషిగా మారనున్న పు ట్ట మధు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హర్వత లేదని శశిభూషణ్ కాచే అన్నారు. గోదావరి నది పై నిర్మించిన ప్రాజెక్టులు నాణ్యత లో పంతో కృంగిపోతే మంత్రి శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ పార్టీ సంబంధం ఎలా ఉంటుందని ఆయన విమర్శించారు.
మీ ప్రభుత్వంలో ల క్షల కోట్ల రూపాయలు వెచ్చించి, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, గొప్పలు చెప్పుకున్న మీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు రెండు ఏళ్లలో నాణ్యత లోపంతో కృంగిపోతే దానికి బాధ్యులు మీ సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీష్ రావు మీరు కాదా అని ఆయన ప్ర శ్నించారు.
ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో 2002 లో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రా జెక్టు నిండుకొని, మీరు నిర్మించిన ప్రాజెక్టులోకి నీళ్లు వదిలితే మంథని ప్రాంతాన్ని నిం డా ముంచిందని, కానీ మీ ప్రభుత్వంలో కో టి రూపాయలు నష్టం జరిగిన మంతిని ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదని, ఇప్పుడు రాజకీయం కోసం ప్రాజెక్టుల వద్దకు వెళ్లి గోదావరి నీళ్లు వృధా పోతున్నాయని పుట్ట మధు ఆరోపించడం ఆయన విద్యుత్కే వదిలేస్తున్నామన్నారు.
వర్షాకాలంలో వర్షాలు కురిసి గోదావరి నదిలో అధికంగా నీరు వస్తే నీటిని సముద్రంలోకి వదలకుండా ఎలా ప్రాజెక్టులో ఉంచుతారని ఆయన ప్రశ్నించారు. అలా మీరు ఉంచినందుకే మంథని ప్రాంతం మునిగిపోయిందని కాచే విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.