23 March, 2026 | 2:38 AM

టూరిజం విలేజ్ నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలి

23-03-2026 01:10 AM

రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క

ములుగు, మార్చి22 (విజయక్రాంతి): టూరిజం విలేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా నాణ్యత ప్రమాణాల విషయంలో నిరంతరం అధికారులు తనిఖీ చేస్తూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు.

ములుగు మండలం ఇంచర్ల గట్టమ్మ వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రామప్ప ప్రాంత సుస్థిర పర్యాటక సర్క్యూట్ లో భాగంగా నిర్మిస్తున్న టూరిజం విలేజ్ నిర్మాణ పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి నిర్మాణ పనులలో గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.