దేశ సంక్షేమమే రాహుల్గాంధీ లక్ష్యం
28-02-2026 12:00 AM
- ఆయన సూచనలను పటించుకోని మోదీ
- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి): దేశ సంక్షేమం కోసం ఆలోచించే నేత రాహుల్గాంధీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్గాంధీ దేశ ప్రజల సంక్షేమం కోసం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారని, వాటిని ప్రధాని నరేంద్రమోదీ మాత్రం పరిణనలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ఫెయి ల్ అవుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య నివారణకు రాహుల్గాంధీ చేసిన సూచనలను మోదీ వింటున్నాడే తప్ప అమలు చేయడం లేదన్నారు.




