26-05-2025 05:04:09 PM
ముగిసిన సీపీఐ పట్టణ మహాసభ.. నూతన బాడీ ఎన్నిక..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ 21వ మహాసభ సోమవారం బాసెట్టి గంగారం భవనంలో జరిగింది. పట్టణ సెక్రెటరీ అడేపు రాజమౌళి(Secretary Adepu Rajamouli) అధ్యక్షతన ఈ మహాసభ నిర్వహించారు. ఈ మహాసభలో సీపీఐ పట్టణ నూతన బాడీని ఎన్నుకొన్నారు. నూతన పట్టణ కార్యదర్శిగా ఆడెపు రాజమౌళి మరోసారి ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శిగా బొల్లం తిలక్ అంబేద్కర్, కోశాధికారిగా మంతెన రమేష్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య నూతన బాడీని ప్రకటించారు.
పలు తీర్మానాలు...
ఈ మహాసభలో చేసిన వాళ్ళు తీర్మానాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించాలని, మున్సిపల్ ప్రతి వార్డులో రోడ్లను మెరుగుపరిచి ప్రతి గల్లీకి అంబులెన్స్ పోయే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజువారీగా పరిశుభ్రత చేయించాలి ట్రైనీ చెత్తాచెదారం లేకుండా ప్రతి వార్డులో పరిస్థితి పాటించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలో జరిగిన వెహికల్స్ కొనుగోలు కాంట్రాక్టు కార్మికులను నియమించడంలో అభివృద్ధి పనులు నాన్యత పాటించకపోవడంపై విచారణ చేసి దోషులనును శిక్షించాలని తీర్మానం చేశారు.
అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు వార్డు సభల ద్వారా ఎన్నిక చేసి రాజీవ్ యువ వికాస స్కీమ్ అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ లోన్ మంజూరు చేయాలని, బెల్లంపల్లి పట్టణంలో అన్ని బస్తీలలో సింగరేణిలో నివాసముంటున్న వారికి సర్వేనెంబర్ 170 పిపి ఇండ్లు నిర్మించుకొని వారికి జీవో నెంబర్ 58, 59 ప్రకారం అందరికీ పట్టాలు ఇవ్వాలని, అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, పట్టణంలోని అన్ని వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ వేసి గోదావరి నీటిని రోజుకోకసారి తాగునీటిని సరఫరా చేయాలని, పట్టణంలో నిర్మించిన డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలకు వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారి డిసిగ్నేషన్ తెలిపే నేమ్ ప్లేట్ ఉండాలని, ఏ సర్టిఫికెట్స్ ఎన్ని రోజులకు ఇస్తారని తెలిపే బోర్డులను పెట్టాలని, రెండో వార్డులోని పాలిటెక్నిక్ కళాశాల ఏరియాలో సీసీ రోడ్, గ్రౌండ్ బస్తీ వాడల్లో సీసీ రోడ్లను నిర్మించాలన్నారు.
కన్నాల బస్తీ శివారులో వైకుంఠధామం నిర్మించాలని, తక్షణమే బస్సు డిపో నిర్మించాలని, ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్ల నియమించి నాణ్యత కలిగిన మందులు ఇవ్వాలని, బెల్లంపల్లి పట్టణంలో కన్నాల శివారులో గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న భూకబ్జాలు, రియల్ ఎస్టే భూములను కాపాడడానికి హైడ్రా కమిషనర్ ను ఏర్పాటు చేసి ఈ భూములను కాపాడాలని, బెల్లంపల్లి పట్టణ పరిసరాలలో విపరీతంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని దాని పరిష్కారానికి చిన్న తరహా పరిశ్రమలు గాని లేక ఒక భారీ పరిశ్రమను నిర్మించి యువతి యువకులకు ఉపాధి కల్పించాలని, మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించతలపెట్టిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాలని తీర్మానించారు.
బెల్లంపల్లి పట్టణానికి ఎలాంటి నష్టం జరగకుండా బొగ్గు నుండి ఉత్పత్తి అయ్యే మిథిన్ గ్యాస్ పరిశ్రమను నెలకొల్పాలని, ఎక్స్ప్లోరేషన్ ద్వారా సర్వే చేసిన చాఫ్ట్ 1,2,3,4 బొగ్గు గనులు ప్రారంభించాలని, బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట, తాండూరు, నేన్నెల ,భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, మండలాల గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రచారం చేసిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని మహాసభలలో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు బొంతల లక్ష్మీనారాయణ, బియ్యాల ఉపేందర్, పట్టణ కార్యవర్గ సభ్యు లు భోంకూరి రామచందర్, బండారి శంకర్, మంతెన రమేష్, శనిగారపు రాజేందర్, కాoపెళ్లి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.