మత సామరస్యానికి ప్రతీక రాజేంద్రనగర్
మైలార్దేవ్పల్లిలో ఘనంగా న్యాజ్
మణికొండ, మార్చి 29 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం మత సామరస్యానికి నిలయమని, అన్ని వర్గాల ప్రజ లను కలుపుకుని వెళ్లడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి అమ్మ గార్డెన్లో నిర్వహించిన న్యాజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలా ది మంది ప్రజలకు స్వయంగా అన్నదానం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ కె. రామకృష్ణ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేణు గౌడ్ పాల్గొన్నారు. వారితో పాటు నార్సింగి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏర్పుల కుమార్, లక్ష్మి శ్రీ, నాయకులు బషీర్, శ్రావ ణ్ కుమార్, పుల్లారావు, సంతోష్ తదితరు లు హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలతో అమ్మ గార్డెన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.




