2 May, 2026 | 7:10 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

తరిగొప్పుల పోలీసు స్టేషన్ లో రాఖీ సంబరాలు

09-08-2025 01:06 PM

తరిగొప్పుల: అన్న, చెల్లెలా అనురాగం, అక్కా, తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగని ఎస్సై గుగులోత్ శ్రీదేవి  అన్నారు. శనివారం తరిగొప్పుల పోలీస్ స్టేషన్ లో(Tarigoppula Police Station) రాఖీ పండగ సంబరాలు నిర్వహించారు. ఎస్ఐ శ్రీదేవి మండలంలోని ప్రింట్ మీడియా జర్నలిస్టులకు రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సోదర, సోదరీమణుల మధ్య సంబంధాలను బలపరిచే విధంగా సుఖసంతోషాలతో రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని, రాఖీ  పండుగ జర్నలిస్టులతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో జర్నలిస్టులు పోలీసులకు సహకరించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.