calender_icon.png 1 May, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ

14-04-2025 01:43:44 AM

ములుగు, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి) : ములుగు జిల్లా ఏటూరునాగారం వైజంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు చేసేది బీజేపీ ఒక్కటేనని  గుర్తించాలన్నారు.