14-01-2026 08:24:28 PM
రామగిరి,(విజయక్రాంతి): సెంటినరీ కాలనీకి చెందిన సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్, రామగిరి హై స్కూల్ ప్రిన్సిపాల్ కళాధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. కళాధర్ రెడ్డి సెంటీనరి కాలనీలో మొట్టమొదటి ప్రైవేటు పాఠశాలను స్థాపించి, ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అలాగే ప్రస్తుతం సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా కొనసాగుతున్నారు. ఆయన ఆకస్మిక మృతితో సెంటీనరి కాలనీ లో విషాదచాయలు నెలకొన్నాయి. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తెలు ఉన్నారు.